వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే.. తెలంగాణలో వర్షాలు పడుతుండగా.. వచ్చే ఐదు రోజులు గట్టిగానే వర్షాలు కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అకాల వర్షాలతో.. రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతుండగా.. ఇప్పుడు కురిసే వర్షాలకు కొనుగోలు కేంద్రాల వద్ద ధ్యాన్యంతో వేచి చూస్తోన్న రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.