రోడ్డుపై మనీపర్సులు.. తెలంగాణ పోలీసులు ఏం ఐడియా వేశారు గురూ!
3100 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిసమాజంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై జనాల్లో అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైం పోలీసులు క్రియేటివ్ థాట్స్తో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే.. ఓ ట్రెండీ ఐడియాను అమలు చేస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్డుపై ఓ పర్సు.. అందులో నుంచి బయటికి కనిపిస్తోన్న 500 రూపాయల నోటు.. అదేంటబ్బా రోడ్డుపై ఎవరో పర్సు పడేసుకున్నారని దగ్గరికి వెళ్లి తీసుకుని చూస్తే.. దిమ్మదిరిగిపోయే ట్విస్ట్. అది నిజంగా పర్సు కాదు. అందులో కనిపించేది నిజంగా 500 రూపాయల నోటు కాదు. అదొక.. బ్రోచర్ మాత్రమే. అలా అని అదేదో ప్రాంక్ కాదండోయ్.. సైబర్ క్రైం పోలీసులు నిర్వహిస్తోన్న వినూత్నం ప్రచారం. అయితే.. ఆ బ్రోచర్లో ఓపెన్ చేసి చూస్తే.. అందులో ఓ మెస్సేజ్ కనిపిస్తుంది. అదేంటంటే.. అసలుకు, నకిలీకి మధ్య తేడా గుర్తించాలన్న సందేశం ఉంటుంది. అచ్చం ఈ పర్సు లాగానే ఆన్లైన్ మోసాలు కూడా ఉంటాయని.. ఆశపడి అలాంటి మాయల్లో చిక్కుకుని మోసపోవద్దని ప్రజలకు ఈ బ్రోచర్ ద్వారా సైబర్ క్రైం పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే.. ఇలా ఏవరైనా సైబర్ క్రైం బాధితులు ఉంటే.. వెంటనే 1930కు కాల్ చేయాలని అందులో ఉంది.