పరువు హత్య.. కూతురు వరసయ్యే యువతితో ప్రేమ, పెళ్లి.. చివరికి..
1277 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిరంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కూతురు వరసయ్యే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు దారుణ హత్యకు (honor killing) గురైన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్కు చెందిన కరణ్ కుమార్ కోళ్ల ఫారంలో కూలీ పనులు చేస్తుంటాడు. అదే రాష్ట్రానికి చెందిన రంజిత్ కుమార్ కుటుంబంతో సహా ఉపాధి కోసం వచ్చి స్థానిక కోళ్ల ఫారంలో పని చేస్తున్నాడు. కరణ్ కుమార్, రంజిత్ కుమార్ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఇద్దరు వరుసకు సోదరులు. అయితే కరణ్ కుమార్ వావి వరసలు మరిచి రంజిత్ కుమార్ కూతురుని ప్రేమించాడు. దీంతో ఇద్దరు రహస్య వివాహం చేసుకున్నారు. కూతురు వరసయ్యే తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడనే కోపం యువతి తండ్రి రంజిత్ పాశ్వాన్ తన బంధువులతో కలిసి కరణ్ను చంపి పొలంలో పాతిపెట్టాడు. కరణ్ సోదరుడి ఫిర్యాదుతో ఈ హత్య వెగులోకి వచ్చింది. కరణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితులు పరారిలో ఉండా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.