తెలంగాణలో ఎండలు, వేడి గాలులు.. ప్రజలకు బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వేసవి వచ్చేసింది. ఫిబ్రవరి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. చలిప్రభావం తగ్గి మార్చి తొలివారంలోనే ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండుతున్నాయి. తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మరో ఐదు రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని, పొడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు. గడిచిన పదేళ్లలో వేసవిలో పగలు సగటు ఉష్ణోగ్రతలు పెరిగాయని నాగరత్న చెప్పారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ మూడు నెలలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ వేసవిలో ఎండల తీవ్రత, వడగాల్పులు.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సమయం’తో డాక్టర్ నాగరత్న ప్రత్యేకంగా మాట్లాడారు.