కల్వకుంట్ల హిమాన్షు రావు తొలి స్పీచ్.. తడబాటు లేకుండా
1469 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిముఖ్యమంత్రి కేసీఆర్ మనువడిని కదా.. ఏదైనా నార్మల్గా చేసే అలవాటు లేదని కల్వకుంట్ల హిమాన్షురావు అన్నారు. గౌలిదొడ్డి (హైదరాబాద్)లోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు తొలిసారి వచ్చినపుడు తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయని ఆయన చెప్పారు. ఆడపిల్లలకు సరైన బాత్రూమ్లు లేవని.. స్కూల్లో మెట్లు కూడా సరిగా లేవని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులను తానెప్పుడూ చూడలేదని అన్నారు. కోటి రూపాయల నిధులు సేకరించి అధునాతన హంగులతో తీర్చిదిద్దిన ఈ బడిని హిమాన్షు తన పుట్టిన రోజు సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి బుధవారం (జూలై 12) ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హిమాన్షు మాట్లాడారు. తొలి ప్రసంగమేనైనా.. ఏమాత్రం తడబడకుండా మాట్లాడారు. హిమాన్షు రావు ప్రసంగం వీడియో..