జ్వరమొచ్చినా నిలబడాల్సిందే, ఒక్కరోజు కూడా సీటు దొరకట్లే.. ప్రయాణికుడి ఆవేదన
1732 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అందుబాటులోకి వచ్చిన దాదాపు 70 రోజులు కావొస్తున్నా.. ఇంకా ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగటం వల్ల.. కొత్తగా బస్సులు తీసుకొచ్చినా కూడా సీట్లు దొరకటం లేదు. ఇప్పటికీ మగవాళ్లు గంటల తరబడి నిలబడి పోవాల్సిన పరిస్థితే ఉంది. ఈ క్రమంలో.. ఓ మగ ప్రయాణికుడు చాలా ఫ్రస్ట్రేషన్కు లోనయ్యాడు. తనకు జ్వరమొచ్చిందని.. అయినా సరే నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోజూ బస్సులో ప్రయాణం చేస్తున్నా.. ఒక్కరోజు కూడా తనకు సీటు దొరకటం లేదంటూ తన కోపాన్నంతా వెళ్లగక్కాడు. ఫ్రీ బస్సు పథకం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.