నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు వాళ్లను మర్చిపోను: మైనంపల్లిమల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో అధిష్ఠానం తనకు మళ్లీ అవకాశం కల్పించినా.. తన కుమారునికి ఛాన్స్ ఇవ్వలేదన్న కోపంతో.. పార్టీని వదిలారు మైనపల్లి. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ వీడియో విడుదల చేశారు. విత్ ఇన్ నో టైం.. ఏ పార్టీలో చేరబోతున్న విషయాన్ని తెలియజేస్తానంటూ చెప్పుకొచ్చారు కూడా. అనుచరుల కోరిక మేరకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు మైనంపల్లి. గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తనను నమ్మిన అనుచరులకు అండగా ఉంటానన్నారు. దేనికి లొంగే ప్రసక్తే లేదంటూ పెద్ద పెద్ద డైలాగులు వేశారు. అయితే.. ఆయన కారు దిగి.. డైరెక్టుగా కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నట్టు వార్తలు జోరందుకున్నాయి.