'పోలవరాన్ని కట్టించేది కేసీఆరే.. ఆ దమ్ము ఇంకెవ్వరికీ లేదు..'
ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది సీఎం కేసీఆరేనని.. ఆ దమ్ము ఇంకెవ్వరికీ లేదని మల్లారెడ్డి తెలిపారు. అటు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా కాపాడేది కూడా సీఎం కేసీఆరేనని తెలిపారు. మేడే సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సభలో మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
hyderabadTimesXP TeluguUpdated: 1 May 2023, 4:39 pm