ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం జర్నీ.. ప్రయాణికులతో సరదా ముచ్చట్లు
1242 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిహైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తుండగా .. ఆర్టీసి బస్సులో ఆకస్మిక ప్రయాణం చేశారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ . ఈ క్రమంలో బస్సులో ప్రయణిస్తున్న ప్రయాణికులతో ముచ్చటించారు. నారాయణ్ పేట్ బస్సులో వెళ్తున్న ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇలా నందిగామ నుంచి షాద్ నగర్ వరకు ప్రయాణం చేశారు మంత్రి పొన్నం. మంత్రి వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి కూడా బస్సులో ప్రయాణం చేశారు.మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణం.. ప్రయాణం వల్ల ఆదా అవుతున్న డబ్బులు తదితర వివరాలు అడిగ తెలుసుకున్నారు మంత్రి పొన్నం.