సికింద్రాబాద్ మోండా మార్కెట్లో భారీ చోరీ జరిగింది. దొంగల తెలివితేటలు మితిమీరిపోయాయి. హైదరాబాద్లో కొద్దిరోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకుని.. దొంగలు కూడా దోచుకునే స్టైల్ మార్చేశారు. హుందాగా వెళ్లి దొంగతనానికి పాల్పడుతున్నారు. అదేలా అంటారా.. ఓ ఆరుగురు దుండగులు ఐటీ అధికారులమంటూ జ్యువెలరీ షాప్లోకి చొరబడి.. తనిఖీల పేరుతో హడావిడి చేసి.. కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్లో చోటు చేసుకుంది.
hyderabad|TimesXP Telugu|Updated: 27 May 2023, 7:17 pm