యజమాని ఇంట్లో రూ. 5 కోట్లు చోరీ.. నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
1236 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిసికింద్రాబాద్ సింధి కాలనీలో ఈనెల 9న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఓ వ్యాపారి ఇంట్లో రూ. 5 కోట్ల సొత్తును దొంగతనం చేయగా.. ఈ కేసులో మెుత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో నమ్మకంగా పని చేస్తూనే.. ఓ నేపాలీ తన గ్యాంగ్తో కలిసి ఈ భారీ దోపీడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వ్యాపారి అపార్ట్మెంట్లో గత ఐదేళ్లుగా వాచ్మెన్గా పని చేస్తున్న నేపాల్కు చెందిన శంకర్ మాన్ సింగ్ అలియాస్ కమల్.. మరో 12 మందితో కలిసి ఈ దోపిడీ చేసినట్లు తెలిపారు. 41 లక్షల నగదు, 2.8 కేజీల బంగారం, 18 ఖరీదైన వాచ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మెుత్తం 13 మంది నిందితుల్లో మరో 9 మందిని అదుపులోకి తీసుకోగా.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు.