కూకట్పల్లి వై జంక్షన్ నుంచి బాలానగర్ వెళ్లే దారిలో హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. దీంతో డ్రైవర్ ప్రయాణీకులను అప్రమత్తం చేయడంతో అందరూ పరుగుపరుగున బస్సు దిగి దూరంగా పరుగెత్తారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
hyderabadTimesXP TeluguUpdated: 3 Jun 2023, 12:50 pm