సీఎంగా రేవంత్ రెడ్డి ఫస్ట్ స్పీచ్.. ‘పాలకుణ్ని కాదు మీ సేవకుణ్ని’..
2020 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘తెలంగాణలోని 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వాలని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటవుతోంది. దీంతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రి వర్గంతో తెలంగాణకు సామాజిక న్యాయం చేకూరుతుంది. రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే.. అక్కడ గడీలా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను బద్దలుకొట్టించాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాటిస్తున్నా.. తెలంగాణ ప్రజలు ఎప్పుడు రావాలనుకున్నా.. ప్రగతి భవన్లో నిరభ్యంతరంగా రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరంతా భాగస్వాములు. సంక్షేమ పథకాలు అందేలా.. అభివృద్ధి బాటలో సాగేలా బాధ్యత నాది. ప్రగతి భవన్ కంచెలు బద్దలుకొట్టాం.. రేపు ఉదయం 10 గంటలకు ప్రజాభవన్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం. మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడటం కోసం, ఈ నగరాభివృద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీపడేలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. పేదలు, నిస్సహాయులకు అండగా ఉంటాం. మీ సోదరుడిగా, మీ బిడ్డగా ఈ బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. మేం పాలకులం కాదు.. సేవకులం. మీరు ఇచ్చిన అవకాశాన్నిబాధ్యతగా ఎంతో గౌరవంగా.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తాం. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది’ అని రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగంలో వ్యాఖ్యానించారు.