కాంగ్రెస్ అభ్యర్థుల నియమాకాలపై గందరగోళం.. దయచేసి మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి.. మీడియాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
1214 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పుటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి సన్నద్ధమైంది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించనేలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే అంటూ పలు మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే అది నిజం కాలేదని, కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులు ఫైనల్ చేయలేదని టీపీసిసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆయన మీడియాను కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నియమాకాలకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయన్నారు. పార్టీ ఎప్పుడూ నియమ నిబంధలు ఉల్లంఘించదని అన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నియమాకాలపై తమకు నచ్చినట్టుగా వార్తలు రాసి బీ ఫాం పచ్చిపట్టే పని మీరు తీసుకోవద్దంటూ రేవంత్ రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు.