కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే కాళేశ్వరం కుంభకోణం: కిషన్ రెడ్డి
1151 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిబీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని కిషన్ రెడ్డి విమర్శించారు. అలా కాదంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన 48 గంటల్లో సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని సవాల్ విసిరారు. కేసీఆర్, బీఆర్ఎస్కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యనించారు.