ఫోన్ వాడొద్దని తల్లి మందలించినందుకు.. ఎంత పని చేశాడు.!!
1713 views
కరీంనగర్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఫోన్ వాడొద్దు అని తల్లి మందలించడంతో ఉరివేసుకొని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయి చరణ్(14) అనే బాలుడు 9వ తరగతి చదువు తున్నాడు. తన తల్లి ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని మందలించడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో గది తలుపులు వేసుకొని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఫోన్ కారణంగా బాలుడు మృతి చెందడంతో గ్రామంలొ విషాధ చాయలు అలుముకున్నాయి. కాగా బాలుని తండ్రి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు.