కోరుట్లలో అరుదైన ఘటన.. 24 వేళ్లతో జన్మించిన శిశువు
నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం ఏరుగట్లకు చెందిన రవళి అనే మహిళ ఆదివారం మగశిశువుకు జన్మనిచ్చారు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ఈ శిశువుకు రెండు కాళ్లు, రెండు చేతులకు ఆరు వేళ్లు ఉన్నాయి. ఆ శిశువును చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాలా అరుదుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.