కరీనంగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో దారుణం చోటుచేసుకుంది. సీటు కోసం ఆడవాళ్ల మధ్య గొడవ జరిగింది. అయితే.. ఆ గొడవ పెట్టుకున్న మహిళల్లో ఒకరు ఎస్సై భార్య ఉంది. దీంతో.. గొడవ విషయం తన భర్తకు ఫోన్ చేసి చెప్పటంతో.. సినిమా స్టైల్లో ఆ ఎస్సై ఎంట్రీ ఇచ్చాడు. అంతేనా.. నోటికొచ్చినట్టు అమ్మాయిని తీడుతూ.. జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి కొట్టాడు.. బూటు కాలితో తన్నాడు కూడా. ఈ ఘటన ఇప్పుడు జగిత్యాలలో తీవ్ర చర్చనీయాంశం మారింది.
karimnagarTimesXP TeluguUpdated: 10 May 2023, 5:26 pm