ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులతో పాటు జర్నలిస్టులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.