పాలేరు మట్టి సాక్షిగా చెబుతున్నా.. షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
1227 views
ఖమ్మం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల మరోసారి స్పష్టం చేశారు. దమ్ముంటే తనను ఓడించాలని ఆమె ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ‘ఇదే పాలేరు మట్టి సాక్షిగా.. రాజన్న సంక్షేమ పాలన అందిస్తానని గతంలో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిచ్చింది. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. పులి కడుపున పులే పుడుతుంది. మీ బిడ్డనైతా.. మీ బలమైతా.. అతికొద్ది రోజుల్లో మళ్లీ పాదయాత్ర మొదలుపెడతా.. పాదయాత్రను 4 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇదే పాలేరులో ముగిస్తా’ అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వ్యాఖ్యానించింది. ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.