పాఠశాలలో క్షుద్రపూజల కలకలం.. వణికిపోతున్న విద్యార్థులు
కాలం ఎంత మారుతున్నా.. ఇప్పటికీ గ్రామాల్లో అక్కడక్కడా క్షుద్రపూజలనే మాట మాత్రం వినిపిస్తూనే ఉంది. అందూలోనూ ఈ మధ్య ఇది పాఠశాలల్లో వినిపించటం కాదు.. కనిపిస్తోంది కూడా. తాజాగా ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడలోని ప్రభుత్వ పాఠశాలలో కలకలం రేపుతోంది. పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయుడి గది ముందు.. పసుపు, కుంకుమ కుప్పలు వాటిపై కోడిగుడ్డు, నిమ్మకాలు పెట్టి ఉండటం అటు విద్యార్థులనే కాదు.. ఇటు ఉపాధ్యాయులను కూడా వణికిస్తోంది.nalgondaTimesXP TeluguUpdated: 20 Apr 2023, 6:46 pm