ఫిలిఫ్పీన్స్లో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్కు వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లికి చెందిన మణికాంత్.. మరణించాడు. చెట్ల పొదల్లో అనుమానాస్పద స్థితిలో అతని మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం ఈరోజు ఉదయం తల్లిదండ్రులకు చెప్పగా.. కొడుకు మరణ వార్త విని గుండెలు బాదుకుంటున్నారు.