ఫలక్నుమా రైలు: డబ్బు, బంగారం బూడిదైంది.. ప్రయాణికుల కన్నీళ్లు
1641 views
నల్గొండ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిFalaknuma Express: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం ఘటనలో ప్రాణనష్టం లేకపోయినా.. తీవ్ర నష్టం మిగిల్చింది. మంటలు మండుతున్న బోగీల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కిందికి దూకి పరుగెత్తిన ప్రయాణికులు.. తమ బ్యాగులు, విలువైన వస్తువులను బోగీల్లోనే కోల్పోయారు. అవి అగ్నికి ఆహుతయ్యాయి. బట్టలు, బంగారం కోల్పోయాని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. కొంత మంది ప్రయాణికులు ఫోన్లు, ల్యాప్టాప్లు, విలువైన సర్టిఫికెట్లను కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య జూలై 7న ఉదయం ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 7 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. పలాసకు చెందిన ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో వందలాది మంది ప్రాణాలు నిలిచాయి. అయితే, చైన్ లాగి అంత మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి పొగ పీల్చుకోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. ఆయణ్ని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఫలక్నుమా రైలు ప్రమాద బాధితుల కష్టాలు వీడియోలో..