చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే గంప గోవర్దన్
రైతుల సమస్యను పరిష్కరించేందుకు వెళ్లి కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తడిసిన ధాన్యం కొనట్లేదని రైతులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకోవటంతో స్పందించిన ఎమ్మెల్యే.. రైస్ మిల్లుకు వెళ్లి మాట్లాడి సమస్యను పరిష్కరించాలనుకున్నారు. కానీ.. అక్కడి సిబ్బంది ఇచ్చిన సమాధానంతో.. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే సహనం కోల్పోయి చెంప చెల్లుమనిపించారు. దీంతో.. ఆ వీడియో కాస్త వైరల్గా మారింది.nizamabadTimesXP TeluguUpdated: 6 May 2023, 9:25 pm