మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులు నీళ్లు రావడంతో వాహనాదారులు ఆందోళనకు దిగారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని బంకు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అప్పటికే బంకులో పెట్రోల్ కొట్టించుకున్న పలువురు వాహనదారులు అక్కడకు చేరుకున్నారు. బంకులో పెట్రోల్ కొట్టిస్తే.. తన రూ. 20 లక్షల కారు రోడ్డుపై ఆగిపోయిందని ఓ వాహనదారుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యాడు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో బంక్ నిర్వహకులపై దాడి చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.