జహీరాబాద్లో కాస్ట్లీ దొంగతనం.. సీసీ ఫుటేజీ వైరల్
1577 views
సిద్ధిపేట వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిసంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఖరీదైన దొంగతనం జరిగింది. ఏకంగా మూడు బాక్సుల సరుకు మాయమైంది. ఖరీదైన దొంగతనం అంటే ఏ బంగారమో, వజ్రాలో, భారీ నగదో అనుకుంటే.. పప్పులో కాలేసినట్టే. మరీ వీటికంటే ఖరీదైనది ఇంకేమై ఉంటుందబ్బా అని బుర్రలు బద్దలు కొటుకోకండి.. ఇప్పుడు దేశంలో ధరలతో సామాన్యులకు మంటెక్కిస్తోన్న టమాటాలే ఆ ఖరీదైన సరుకు. దేశంలో టామాటా ధరలు 160 రూపాయలు పలుకుతుండటంతో.. వీటిని సామాన్యులు ఇప్పుడు అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ ఖరీదైన కూరగాయను పండించిన కొందరు రైతులు కోటీశ్వరులైన వార్తలు చూస్తున్నారు. కానీ.. కొందరు మాత్రం బాక్సులకు బాక్సులే మాయం చేసి.. రాత్రికిరాత్రే కోటీశ్వరులైపోవాలని ఆరాట పడుతున్నారు. అందులో భాగంగానే.. జహీరాబాద్లో ఓ వ్యక్తి టమాటాల బాక్సులను ఎత్తుకెళ్లిపోయాడు. ఈ చోరీపై బాధిత రైతు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని మరీ టమాటా బాక్సులను ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు.