మంచి వ్యక్తిని గెలిపించండి.. చేవెళ్ల అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత మద్దతు
1596 views
వికారాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితెలంగాణలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ధనిక ఎంపీ అభ్యర్థుల్లో రెండో వ్యక్తి అయిన కొండా.. పార్టీ మేనిఫెస్టో కాకుండా చేవెళ్ల నియోజకవర్గానికి సంకల్ప పత్రం పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో కూడా రూపొందించి విడుదల చేశారు. అయితే.. కొండా విశ్వేశ్వర రెడ్డికి మద్దతునిస్తూ..ఏపీ తెలుగుదేశం పార్టీలో కీలక నేత అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఓ వీడియో విడుదల చేశారు.