మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన.. రూ. 100 కోట్లతో ఐటీ టవర్కు శంకుస్థాపన
1180 views
వరంగల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిKTR Warangal Tour: తెలంగాణ పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. భారీ బహిరంగ సభలలో పాల్గొన్న కేటీఆర్ సభలో సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు తన చేతుల మీదుగా సంక్షేమ ఫలాలను అందించారు. ఇక మంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూల్ విషయానికి వస్తే ఉదయం 9:15 నిమిషాలకు కేటీఆర్ హన్మకొండకు చేరుకుని. 9 గంటల 30 నిమిషాలకు లష్కర్ బజారులోని గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉదయం అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 9 గంటల 45 నిమిషాలకు 100 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఐటీ టవర్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బంధం చెరువు వద్ద 26 కోట్లతో చేపట్టిన 15 ఎంఎల్డిఎస్టిపి పనులను ప్రారంభించారు.