ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే మోదీ వరంగల్కి రావాలి: కేటీఆర్
1326 views
వరంగల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితెలంగాణ గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను పీఎం నరేంద్ర మోదీ విస్మరించాలని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అందుకు తెలంగాణ బిడ్డలకు నరేంద్ర మోదీ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్.. ఈ వ్యాఖ్యలు చేశారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేసిన కేటీఆర్.. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచినట్టుగా ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని పార్లమెంట్లో పీఎం నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. అందుకోసం.. మలుగు జిల్లా కేంద్రంలో 360 ఎకరాల భూమిని కూడా తెలంగాణ సర్కారు కేటాయించిందని తెలిపారు. అయినా కూడా ఇప్పటి వరకు యూనివర్శిటీని ఎందుకు ఏర్పాటు చేయట్లేదో చెప్పాలని.. నిలదీశారు.