ములుగు ఎమ్మెల్యే సీతక్క కన్నీరు
మావోయిస్టు నేత హరిభూషణ్ మరణంపై ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సీతక్క విచారం వ్యక్తం చేశారు. హరిభూషణ్ మృతి చాలా బాధాకరమైన విషయమని, ఆయన ప్రజల మనిషి అని సీతక్క అన్నారు. హరిభూషణ్ మరణ వార్త తెలుసుకున్న ఆమె ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా హరిభూషణ్ కుటుంబసభ్యులు సీతక్కను పట్టుకుని బోరున విలపించారు.సీతక్క కూడా కన్నీరు పెట్టుకుని వారిని ఓదార్చారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో ఆయన టీం లీడరుగా ఉన్నప్పుడు తానూ ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమంలో పనిచేశానని ఎమ్మెల్యే సీతక్క గుర్తుచేసుకున్నారు.warangalTimesXP TeluguUpdated: 25 Jun 2021, 12:57 pm