సెల్ ఫోన్ ఎంత పనిచేసింది.. యువకుడి ప్రాణం పోయింది!
1424 views
వరంగల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిహైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఓ యువకుడు సెలవని ఇంటికి వెళ్తూ ఊహించనివిధంగా దుర్మరణం పాలయ్యాడు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం నెరేళ్ల గ్రామానికి చెందిన ముప్పు శ్రీకాంత్.. ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం (జూన్ 28) పండుగ సెలవు కావడం, ఆ తర్వాత వీకెండ్ కావడంతో స్వగ్రామానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. బుధవారం సాయంత్రం వరంగల్ వెళ్లేందుకు శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కాడు. రద్దీగా ఉండటంతో ఫుట్బోర్డు వద్ద నిల్చొని ప్రయాణం చేస్తున్నాడు. బీబీనగర్ స్టేషన్ సమీపానికి రాగానే.. కొంత మంది దుండగులు శ్రీకాంత్ చేతిలోని సెల్ఫోన్ను లాగేసుకునేందుకు ప్రయత్నించారు. దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో బోగీ నుంచి పడిపోయి రైలు కింద పడి మరణించాడు.