రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక టమాటా కొనాలంటే వినియోగదారులకు నోట మాట రావటం లేదు. ఇప్పటికే కిలో టమాటా ధర సెంచరీని దాటింది. పచి మిర్చి కూడా రికార్డు ధరల పలుకుతోంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కూరగాయల ధరల విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కూరగాయల మార్కెట్లో దొంగలు కూరగాయలను దొంగిలిస్తున్నారు. ఇటువంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో చోటు చేసుకుంది.