మెడికో ప్రీతిది ఆత్మహత్యే.. పోస్టుమార్టం రిపోర్ట్ బయటపెట్టిన సీపీ రంగనాథ్
రాష్ట్రంలో సంచలనంగా మారిన మెడికో ప్రీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్ని రోజులు ప్రీతిది ఆత్మహత్యా.. హత్యా.. అన్న అనుమానాలకు తెరదించుతూ పోస్ట్ మార్టం రిపోర్టు బయటికివచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్న విషయాలను వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. అయితే.. ప్రీతిది ముందు నుంచి చెప్తున్నట్టు ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టులో వైద్యులు ఇదే విషయాన్ని వెల్లడించినట్టు తెలిపారు.warangalTimesXP TeluguUpdated: 21 Apr 2023, 9:19 pm