రాజేంద్రప్రసాద్కు కరోనాతో.. చీరాలలో టెన్షన్
నట కిరిటీ రాజేంద్రప్రసాద్కి కరోనా పాజిటివ్గా నిర్థారణ అవడంతో ప్రకాశం జిల్లా చీరాలలో టెన్షన్ నెలకొంది. హైదరాబాద్లో పాజిటివ్ వస్తే.. చీరాలతో రిలేషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..? రాజేంద్ర ప్రసాద్ కొత్తగా స్టార్ట్ చేసిన శాసన సభ షూటింగ్ చీరాలలోనే ప్రారంభమైంది. ఎమ్మెల్యే కరణం బలరాం ఓపెనింగ్ క్లాప్ కొట్టారు.అయితే.. చీరాల నుంచి హైదరాబాద్ వెళ్లగానే రాజేంద్రప్రసాద్కి కరోనా లక్షణాలు కనిపించడంతో.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో ఇప్పుడు ఆ రోజు షూటింగ్లో ఉన్న వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ శరీరంలో కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.