ఆధ్యాత్మికగురు, సైంటిఫిక్ సెయింట్ శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి 83వ జన్మదిన వేడుకలను కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో స్ఫూర్తి కుటుంబసభ్యులు సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తొలుత సోమవారం ఉదయం (మే 1న) 4.30 గంటల నుంచి 7 గంటల వరకూ ధ్యానకేంద్రంలో పీఠ పూజ జరిపారు. అనంతరం అక్కడ నుంచి స్ఫూర్తి ధామం వరకూ విశ్వమానవతా స్ఫూర్తి చైతన్య యాత్రను స్ఫూర్తికుటుంబసభ్యులు చేపట్టారు. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పలు కార్యక్రమాలు జరిగాయి.
telugu videoTimesXP TeluguUpdated: 1 May 2023, 5:26 pm