ఏపీలోని అనంతపురం జిల్లాలో సుప్రసిద్ధి పెన్నా అహోబిలం శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయ మహా రథానికి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలావస్థకు చేరుకున్న ఆ రథాన్ని మే 2వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని భారీ క్రేన్ల సహాయంతో దాని చక్రాలకు మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులు, మరమ్మతులు చేస్తున్న వ్యక్తులు అప్రమత్తమై వెంటనే పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
telugu videoTimesXP TeluguUpdated: 30 Apr 2023, 12:50 am