ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం జగన్ను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపించారు.