సీఎం జగన్కు నిరసన సెగ.. కాన్వాయిని ఎలా అడ్డుకుంటున్నారో చూడండి!
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయిని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తి వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రైతులను పక్కకు లాగేయడంతో సీఎం కాన్వాయి ముందుకు సాగింది.