తెలంగాణలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి హత్య కేసులో గందరగోళం నెలకొంది. టాక్సికాలజీ రిపోర్టులో ఎలాంటి విషపదార్ధాలు దొరకకపోవటంతో.. కేసులో కొత్త మలుపు తీసుకుంది. అయితే.. ఈ కేసును అనుమానాస్పద మృతిగా మార్చే యోచనలో పోలీసులు ఉండగా.. ముమ్మాటికీ హత్యే అంటూ ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈరోజు డీజీపీని కూడా కలిసి తమ అనుమానాలు వ్యక్తం చేశారు.