రైతు బంధు ఉత్సవాల్లో వ్యవసాయ మంత్రి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో నిర్వహించిన వేడుకల్లో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డితో కలసి ఆయన ఉత్సవాలకు హాజరయ్యారు. పల్లెపల్లెలో రైతుబంధు విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని నిరంజన్ రెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా రైతులు స్వచ్ఛందంగా సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు చెబుతున్నారని అన్నారు. ఎనిమిది విడతలలో రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాలలో వేయడం అపూర్వమైన విజయమన్నారు. రైతు బంధు పథకం ఒక గేమ్ ఛేంజర్ అని యూఎన్వో, ఆర్థిక వేత్తలు, వ్యవసాయ నిపుణులు అభినందించారని మంత్రి చెప్పారు.