జగన్ మాస్కుతో కాలుమీద కాలేసుకుని.. మంత్రి అప్పలరాజు సెల్ఫీ ఛాలెంజ్
ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతంలో గత చంద్రబాబు హయాంలో ఒక్క హార్బర్కు గాని, పోర్టుకు గాని శంకుస్థాపన చేశారా అని సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. టీడీపీ నేతలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. పలాసలో త్వరలో ప్రారంభించనున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ముందు సీఎం జగన్ ఫేస్ మాస్క్తో మంత్రి అప్పలరాజు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. ఫేక్ ఫోటోలతో ఛాలెంజ్లు కాదు.. ఇకపై తామే సెల్ఫీ ఛాలెంజ్ చేస్తామంటూ మంత్రి అప్పలరాజు సవాల్ విసిరారు.