తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తుల రద్దీ నానాటికీ పెరుగుతోంది. ప్రత్యేక రోజులు, సెలవు దినాల్లో వేల సంఖ్యల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఆలయం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి ఆలయానికి వెళ్తున్నారు. అయితే సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదాద్రికి MMTS ట్రైన్లు నడపాలని డిమాండ్ చేస్తున్నారు.