నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం గొల్లపల్లిలో దుండగులు... గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేశారు. ఆ తర్వాత.. తలను, మొండెంను వేరు చేసి విరాట్నగర్లోని మహంకాళి ఆలయం వద్ద పడేశారు. దేవాలయం వద్ద తలను చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
telugu videoTimesXP TeluguUpdated: 10 Jan 2022, 12:53 pm