AP: నేవీ జవాన్కు స్వగ్రామంలో కన్నీటి నివాళి
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిమిలిటరీ విమానం నుంచి జంప్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ ప్రాణాలు విడిచిన ఇండియన్ నేవీ కమాండో చందక గోవింద్ పార్థివదేహం ఆయన స్వస్థలం విజయనగరం జిల్లాలోని పర్ల గ్రామానికి చేరుకుంది. స్థానికులు, గ్రామస్థులు సుమారు 20 కి.మీ. దూరం ర్యాలీగా పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. నేవీ, ఆర్మీ అధికారులు వెంట రాగా.. జవాన్ గోవింద్ పార్థివదేహం ఉంచిన వాహనం ముందుకు కదిలింది. యువకులు జాతీయ జెండాలు చేతబూని బైకుల మీద ఆ వాహనం వెంట కదిలారు. మార్గమధ్యంలో ప్రజలు పూలవర్షం కురిపించి నివాళి అర్పించారు.