Hyderabad: స్విగ్గీ డెలివరీ బాయ్పై యువకులు దాడి చేసిన ఘటన హైదరాబాద్లోని చైతన్యపురిలో వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నారు. వారితో పాటు ఒక యువతి కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా మద్యం మత్తులో ఉందని స్థానికులు చెబుతున్నారు. డెలివరీ బాయ్పై కిక్ బాక్సింగ్ తరహాలో దాడి చేశారు. ముగ్గురు యువకుల్లో ఇద్దరు ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.