రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కాల్పుల కలకలం రేగింది. కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.. ఈ ఘటనలో రియల్టర్ శ్రీనివాస్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. భూవివాదాల నేపథ్యంలోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
telugu videoTimesXP TeluguUpdated: 1 Mar 2022, 1:39 pm