ఆటోమొబైల్ దుకాణానికి నిప్పుపెట్టిన దుండగులు
1022 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిచిత్తూరు జిల్లా పలమనేరులో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆటో మొబైల్ దుకాణానికి నిప్పంటించారు. ఈ అగ్నిప్రమాదంలో దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. లోపల చాలా వరకు ప్లాస్టిక్, రబ్బరు సామగ్రి ఉండటంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. స్థానికులు మంటల్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటికే దుకాణం పూర్తిగా మంటలకు ఆహుతైంది. సుమారు 20 లక్షల విలువ చేసే సామగ్రితోపాటు... 3 లక్షల నగదు కాలిపోయిందని దుకాణం యజమాని తెలిపారు.