ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తెలుగు విద్యార్థులు.. సేఫ్గా ఢిల్లీలో ల్యాండింగ్
1006 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా ఇండియా చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక విమానాలను పంపిన భారతీయ ప్రభుత్వం కొందరు విద్యార్థులను ఇండియాకు చేర్చింది. ఉక్రెయిన్ వెళ్లిన ఎయిరిండియా ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ ప్రత్యేక విమానంలో ఏపీ, తెలంగాణకు చెందిన కొంతమంది తెలుగు విద్యార్థులు మొదటి విడతలో భారత్కు చేరుకున్నారు. తెలుగు విద్యార్థులను ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ రిసీవ్ చేసుకున్నారు.