కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ ట్రైన్లు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య జనవరి 14న తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభమైంది. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఈ ట్రైన్ నడుస్తోంది. ఇక ఈనెల 8న సికింద్రాబాద్ - తిరుపతి మధ్య రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. త్వరలో తెలంగాణ నుంచి మరో వందే భారత్ ట్రైన్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.