'మా ఎమ్మెల్యే రూ.250 కోట్ల అవినీతి చేశారు'.. వైఎస్సార్సీపీ నాయకుల ఆరోపణ
1004 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండికృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారు. ఆయన పదవిని అడ్డుపెట్టుకుని రూ. 250 కోట్లు అవినీతికి పాల్పడ్డారని.. అలాగే కొల్లూరులో 16 వందల ఎకరాలు బినామీ వ్యక్తులకు లీజుకిచ్చి రూ. 50 కోట్ల మేర లబ్ది పొందారని మాలమహానాడు అధ్యక్షుడు జగన్ బాబూరావు, బీసీసెల్ సెక్రటరీ పాపారావు గౌడ్ ఆరోపించారు. కైకలూరులో 80 ఎకరాలు, పామర్రులో 40 ఎకరాలు, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 50 ఎకరాలు, విశాఖలో 50 ఎకరాలు, నడిపురులో 13 ఎకరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.